రైతు ఉద్యమం స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2021-03-04T06:35:11+05:30 IST
వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య పేర్కొన్నారు.
గుంటూరు (తూర్పు), మార్చి 3: వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన అరండల్పేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమానికి మద్దుతుగా గత నెల 21నుంచి వారంరోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 130 మంది ప్రజాసంఘాల ప్రతినిధులతో కలసి ఢిల్లీలో పర్యటించామని తెలిపారు. వ్యవసాయచట్టాలను ఉపసంహరించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేసినట్టు ఆయన చెప్పారు. సమావేశంలో కె.బాబూరావు, యు.గనిరాజు, ఎన్.విష్ణు, మేకల ప్రసాద్, ఇందుర్తి సుబ్బయ్య, సాంబయ్య, రెడ్డి శ్రీను, కృష్ణ, ఝూన్సీ తదితరులు పాల్గొన్నారు.