మొదటి జాబితాను ప్రకటించిన అధికార అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2021-03-05T20:53:56+05:30 IST

అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు.

మొదటి జాబితాను ప్రకటించిన అధికార అన్నాడీఎంకే

చెన్నై : అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. అందులో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నారు. సీఎం పళని స్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం బోడినాయకనూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. దీంతో వారిద్దరూ సిట్టింగ్ స్థానాల నుంచే బరిలోకి దిగుతున్నారన్నది స్పష్టమైపోయింది. ఇక మరో వైపు డి. జయకుమార్ (రాయపురం), సీవీ షణ్ముగం (విల్లుపురం), ఎస్పీ షణ్ముగనాథం (శ్రీవైకుంఠం), తేన్‌మోళి (నీలకొట్టై) నుంచి బరిలోకి దిగుతున్నారు. 

Updated Date - 2021-03-05T20:53:56+05:30 IST