ఉదయనిధి స్టాలిన్ చొక్కాపై డీఎంకే చిహ్నం.. ఈసీకి అన్నాడీఎంకే ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-06T23:11:11+05:30 IST

ఉదయనిధి స్టాలిన్ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాగా మంగళవారం ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి తేనంపేట పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ

ఉదయనిధి స్టాలిన్ చొక్కాపై డీఎంకే చిహ్నం.. ఈసీకి అన్నాడీఎంకే ఫిర్యాదు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతోంది. కాగా ఓటు వేయడానికి వచ్చిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. తన చొక్కాపై డీఎంకే పార్టీ చిహ్నం ఉండడం వివాదాస్పదమైంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఉదయనిధి స్టాలిన్, తన పార్టీ చిహ్నం ఉన్న చొక్కా వేసుకుని వచ్చారని అధికార పార్టీ అన్నాడీఎంకే ఆరోపించింది. అంతే కాకుండా ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.


ఉదయనిధి స్టాలిన్ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాగా మంగళవారం ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి తేనంపేట పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పరీక్ష ఇప్పుడే పూర్తైందని, ఫలితాల కోసం ఎదురు చూడాలని అన్నారు. అయితే మంత్రి పదవి గురించి అడిగిన ప్రశ్నలకు తమ పార్టీ అధినేత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సమాధానం చెప్పుకొచ్చారు. కరుణానిధి కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఎన్నికల బరిలోకి దిగిన ఉదయనిధి.. చెపాక్‌-తిరువల్లికేని స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Updated Date - 2021-04-06T23:11:11+05:30 IST