విత్తనశుద్ధితో చీడపీడల నుంచి పంటకు రక్షణ
ABN , First Publish Date - 2022-08-19T04:57:21+05:30 IST
వరి సాగులో విత్తనశుద్ధితో చీడపీడల నుంచి పంటను రక్షించుకోవచ్చని ఏడీఏ ఇ.అ నిల్కుమారి అన్నారు.
యలమంచిలి, ఆగస్టు 18: వరి సాగులో విత్తనశుద్ధితో చీడపీడల నుంచి పంటను రక్షించుకోవచ్చని ఏడీఏ ఇ.అ నిల్కుమారి అన్నారు. మేడపాడులో గురువారం నిర్వహించిన పొలంబడి కార్యక్ర మంలో విత్తనశుద్ధి, సస్య రక్షణ, యాజమాన్య పద్ధతు లపై రైతులకు ఆమె అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సూచించిన మోతాదుకు మించి ఎరువులు, పురుగుమందులు వాడరాదన్నారు. కార్యక్రమంలో మేడపాడు సొసైటీ ఛైర్మన్ గుర్రాల వెంకట్రావు, మండల వ్యవసాయాధికారి సిహెచ్.దేవి, రైతులు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.