ఇళ్లన్నీ బురద బురద

ABN , First Publish Date - 2020-11-29T05:23:28+05:30 IST

నివర్‌ తుఫాను కడప నగర వాసులకు తీరని కష్టాలు కలిగించింది. వరద తగ్గినా నష్టం మిగిలింది.

ఇళ్లన్నీ బురద బురద
రవీంద్రనగర్‌లోని ఇళ్లల్లో బుగ్గవంక నీటితో తడిచిపోయిన వస్తువులను బయట వేసిన దృశ్యం

బుగ్గవంక నీటితో పాడైపోయిన ఎలక్ర్టానిక్‌ పరికరాలు

కుళ్లిపోయిన నిత్యావసర వస్తువులు

కడప, నవంబరు 28(ఆంరఽధజ్యోతి): నివర్‌ తుఫాను కడప నగర వాసులకు తీరని కష్టాలు కలిగించింది. వరద తగ్గినా నష్టం మిగిలింది. గురువారం రాత్రి బుగ్గవంక ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంతో వంక పరివాహక ప్రాంతమైన ఎర్రముక్కపల్లె, బాలాజీనగర్‌, ద్వారకనగర్‌, శివాజీనగర్‌, నాగరాజుపేట, రవీంద్రనగర్‌, లోహియానగర్‌, మురాదియానగర్‌, అంబాభవానినగర్‌, అల్మా్‌సపేట జలమయమైన సంగతి తెలిసిందే. వర ద నీరంతా ఇళ్లల్లోకి చేరడంతో బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్న ఐదువేల కుటుంబాల్లో కొందరు శనివారం స్వగృహాలకు వెళ్లారు. బురద నీరు చే రడంతో ఇళ్లల్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్‌, కూలర్లు పాడైపోయాయి. ఆహార ధాన్యాలు బియ్యం, పప్పుదినుసులు, బట్టలు దెబ్బతిన్నాయి. ఇళ్లన్నీ బురదమయంగా మారాయి. దీంతో బాధితులు పాడైన వస్తువులను చూస్తూ బోరుమంటున్నారు. బురదను తొలగించే పనిలో ఉన్నారు. రవీంద్రనగర్‌ లోతట్టు ప్రాంతాల్లో ఏ ఇల్లు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.



Updated Date - 2020-11-29T05:23:28+05:30 IST