4 నెలల క్రితం పెళ్లి.. భార్యను పడుకోమని చెప్పి.. చదువుకుంటానంటూ మరో గదిలోకి వెళ్లిన భర్త.. తెల్లవారుజామున ఆమె వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-09-16T00:26:32+05:30 IST

దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేకున్నా.. ఒక్కోసారి కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఇలాగే జరిగింది. వారిద్దరికీ నాలుగు..

4 నెలల క్రితం పెళ్లి.. భార్యను పడుకోమని చెప్పి.. చదువుకుంటానంటూ మరో గదిలోకి వెళ్లిన భర్త.. తెల్లవారుజామున ఆమె వెళ్లి చూస్తే..

దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేకున్నా.. ఒక్కోసారి కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఇలాగే జరిగింది. వారిద్దరికీ నాలుగు నెలల క్రితమే వివాహమైంది. దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి భార్యను పడుకోమని చెప్పి.. చదువుకునేందుకు భర్త ఒక్కడూ మరో గదిలోకి వెళ్లాడు. తెల్లవారుజామున భార్య వెళ్లి చూసి షాక్‌కు గురైంది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) భోజ్‌పూర్‌ పరిధి అహిర్పూర్వా మొహల్లాలో నివాసం ఉంటున్న సత్యేంద్ర కుమార్ (28) కు.. చోట్కి సనాదియా గ్రామానికి చెందిన రూబీ కుమారితో మే 20న వివాహమైంది. సత్యేంద్రకుమార్ ఇటీవల పోలీసు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. భార్య రూబీని బాగా చూసుకునేవాడు. అయితే రూబీ అత్తమామలు, బావ, ఆడపడుచులంతా రూబీతో తరచూ గొడవపడేవారు. కానీ సత్యేంద్ర మాత్రం భార్యను ఏనాడూ పల్తెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఇదిలావుండగా, మంగళవారం రాత్రి భోజనం చేశాక.. ‘‘నువ్వు పడుకో నేను పక్క రూములో చదువుకోవాలి’’ అని భార్యకు చెప్పి వెళ్లాడు. అయితే ఉదయం రూబీ వెళ్లి చూస్తే ఉరికి వేలాడుతూ కనిపించాడు.

రెండోసారీ కూతురే పుట్టినా ఆ భార్యాభర్తల్లో సంతోషం.. కానీ వారసుడు పుట్టలేదన్న కోపంతో తాత ఎంతపనిచేశాడంటే..


దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. స్థానికులు అక్కడికి చేరుకుని సత్యేంద్రను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యేంద్ర చనిపోయాడని వైద్యులు తెలిపారు. మృతుడి ఎడమ చేతిపై ‘‘సారీ మమ్మీ పాపా, ఐ హేట్ యూ మై లైఫ్’’ అని రాసి ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి భార్య, కుటుంబ సభ్యులను విచారించారు. సత్యేంద్ర భార్య రూబీ మాట్లాడుతూ, అత్తమామలు, బావ తదితరులంతా.. తన భర్తను, తనను రోజూ వేధించేవారని చెప్పింది. అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెట్టేవారని, అయితే భర్త మాత్రం తనకే మద్దతు ఇచ్చేవాడని తెలిపింది. మంగళవారం రాత్రి తన భర్తను దారుణంగా కొట్టారని, అలాగే చేతిపై వారికి అనుకూలంగా రాసుకున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

ఇంటి బయట కూర్చున్న ఇద్దరు కూతుళ్లను బైక్‌లపై వచ్చి ఎత్తుకెళ్లిన యువకులు.. గ్రామస్తులతో కలిసి ఆ తల్లి వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్తే..



Updated Date - 2022-09-16T00:26:32+05:30 IST