పక్షి రెక్కలపై కళాకృతులతో ఆకట్టుకుంటున్న ఆఫ్రీన్!
ABN , First Publish Date - 2021-08-16T17:16:11+05:30 IST
ఆకాశంలో హాయిగా విహరించే పక్షులు మన మనసుకు...
న్యూఢిల్లీ: ఆకాశంలో హాయిగా విహరించే పక్షులు మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పక్షుల రెక్కలు ఎంతో అందంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల ఆఫ్రీన్ ఖాన్ పక్షుల రెక్కలను ఉపయోగించి అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఇతేకాదు విదేశాలలోని కళాప్రియుులు కూడా ఆప్రీన్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.
తన అద్భుత పెయింటింగ్స్ ద్వారా ఆమె మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. చిన్నతరం నుంచి పెయింటింగ్స్పై అభిరుచి కలిగిన ఆఫ్రీన్ అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేశారు. పక్షి రెక్కలపై పెయింటింగ్ వేసేందుకు ఆమె ఆ రెక్కలను పక్షుల పెంపకందార్ల నుంచి సేకరిస్తారు. తరువాత వాటిని శుభ్రం చేసి వాటిపై ప్రముఖులతో పాటు ప్రకృతికి సంబంధించిన చిత్రాలను పెయింట్ చేస్తారు. ఆప్రీన్ పెయింటింగ్స్ ను ప్రధాని మోదీ సైతం మెచ్చుకోవడం విశేషం.