నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-29T13:34:34+05:30 IST

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్: సీసీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. గరిష్ట మద్దతు ధర క్వింటాలుకు రూ.5825గా అధికారులు నిర్ధారించారు. 12శాతం లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొంటామని సీసీఐ అధికారులు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో రద్దీ నియంత్రణ కోసం రైతులకు టోకెన్ల జారీ చేయనున్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానుండటంతో రైతులు పెద్ద సంఖ్యలో తమ పత్తిని తీసుకుని తరలివస్తున్నారు. 

Updated Date - 2020-10-29T13:34:34+05:30 IST