మద్యం మత్తులో స్నేహితుల ఘర్షణ
ABN , First Publish Date - 2021-04-17T04:48:51+05:30 IST
ఆదోని పట్టణంలోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో యువకులు ఘర్షణకు దిగారు. బీరు బాటిళ్లతో తలలు బాదుకున్నారు.
- ఇద్దరికీ తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 16: ఆదోని పట్టణంలోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో యువకులు ఘర్షణకు దిగారు. బీరు బాటిళ్లతో తలలు బాదుకున్నారు. వన్టౌన్ ఎస్ఐ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన స్నేహితులు సరదా కోసం శుక్రవారం సాయంత్రం రెడ్చిల్లీ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగేందుకు వెళ్లారు. ఫుల్గా మద్యం తాగాక బ్రాండ్ మద్యం తెప్పించే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి బీరుబాటిళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వాల్మీకినగర్కు చెందిన మధు, మరాఠిగేరికి చెందిన రాముకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.