పథకాల అమలుకు ఖర్చెంత?

ABN , First Publish Date - 2022-08-20T06:42:16+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎంత ఖర్చవుతుందో మదింపు వేసి ఎలక్షన్‌ కమిషన్‌కు నివేదికలు సమర్పించేలా పార్టీలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో

పథకాల అమలుకు ఖర్చెంత?

పార్టీల నుంచి నివేదికలు అడగండి.. సుప్రీంలో అదనపు వ్యాజ్యం 


న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎంత ఖర్చవుతుందో మదింపు వేసి ఎలక్షన్‌ కమిషన్‌కు నివేదికలు సమర్పించేలా పార్టీలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. పార్టీలు ఇచ్చే వాగ్దానాలు, ప్రకటించే విధానాలపై ఆర్థిక ప్రభావ మదింపు జరిగేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. ఉచిత పథకాల అమలుపై ఇదివరకే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన బీజేపీ నేత అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ అదనపు సమర్పణల కింద శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సంక్షేమ పథకాలు ప్రకటించే అధికారం పార్టీలకు ఉందనడంలో ఎలాంటి వివాదం లేదని, కానీ వాటివల్ల కలిగే అర్థిక ప్రభావం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. దీనిపై పార్టీల నుంచి నివేదికలు తెప్పించుకునేలా ఈసీని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 22న  విచారణ జరనుంది. 

Updated Date - 2022-08-20T06:42:16+05:30 IST