నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

ABN , First Publish Date - 2022-05-24T05:00:01+05:30 IST

రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఎలు హరిత, సురేఖ అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

వట్‌పల్లి/తూప్రాన్‌/తూప్రాన్‌రూరల్‌/చిన్నశంకరంపేట, మే 23:  రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఎలు హరిత, సురేఖ అన్నారు. సోమవారం వట్‌పల్లిలో పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను జోగిపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐ అంబర్‌య్యతో కలిసి ఏడీఎ హరిత తనిఖీ చేశారు.  తూప్రాన్‌లోని రైతు వేదికలో నిర్వహించిన విత్తన దుకాణదారుల సమావేశంలో తూప్రాన్‌ సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ సురే్‌షకుమార్‌, నర్సాపూర్‌ ఏడీఏ సురేఖ, వ్యవసాయ అధికారి గంగుమల్లు విత్తన దుకాణదారులకు పలు సూచనలు చేశారు. కాగా చిన్నశంకరంపేట, గవ్వలపల్లిలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి మహేష్‌ తనిఖీ చేశారు.

Updated Date - 2022-05-24T05:00:01+05:30 IST