అక్రమాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2020-12-05T04:56:32+05:30 IST

ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు హెచ్చరించారు. శుక్రవారం మందస ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హా మీ పనులపై ప్రజావేదిక, సామాజిక తనిఖీ నిర్వహించారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు
పీడీ కూర్మారావును ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు


డ్వామా పీడీ కూర్మారావు

మందస: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు హెచ్చరించారు. శుక్రవారం మందస ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హా మీ పనులపై ప్రజావేదిక, సామాజిక తనిఖీ నిర్వహించారు. 38 పంచా యతీ ల్లో 5,469 అభివృద్ధి పనులు నిర్వహించామని, దీనికోసం రూ.24.26 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్‌, గృహ నిర్మాణం, ఐటీడీఏ, పశుసంవర్ధక శాఖ, వాటర్‌షెడ్‌ పనులకు ఈ నిధులు కేటాయించినట్లు చెప్పారు. 


అధికారుల నిలదీత

ప్రజావేదికకు తమను ఆహ్వానించలేదని అధికారులను వైసీపీ నాయ కులు బాడ జగన్నా యకులు, ఎర్ర గడ్డ కృష్ణమోహన్‌, అగ్గున సూర్యారావు, ఎం.రామారావు నిలదీశారు. ఉపాధి పను ల్లో అక్రమాలు జరిగాయని, గ్రామసభలు నిర్వహించకుండా సామాజిక తనిఖీలు చేయడం ఏమి టని ప్రశ్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో వివాదం సద్దు మణిగింది. ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్‌ అధికారి ఆర్‌.వెంకటరామన్‌, ఎంపీడీవో తిరుమలరావు, ఏపీవో వాసుదేవ నాయుడు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-05T04:56:32+05:30 IST