ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-06-30T05:47:29+05:30 IST

ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేసి, లక్ష్యసాధనలో పురోగతి కన్పించేలా కృషి చేయా లని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ సం బంధిత అధికారులకు సూచించారు.

ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పెడపల్లితోపు కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బసంతకుమార్‌





కలెక్టర్‌ బసంత కుమార్‌

పుట్టపర్తి రూరల్‌, జూన 29: ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేసి, లక్ష్యసాధనలో పురోగతి కన్పించేలా కృషి చేయా లని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ సం బంధిత అధికారులకు సూచించారు.  నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన బుధవారం మండలంలోని పెడపల్లితోపు, పెడపల్లి తండా -1 కాలనీల పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, హౌసింగ్‌ ఇంజనీర్లు, వర్క్‌ ఇనస్పెక్టర్లు తదితర అధికారులు ఇళ్లనిర్మాణాల్లో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలన్నారు. పనుల నత్తనడకపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌పీడీ చంద్రమౌళిరెడ్డి, ఆర్డీఓ భాగ్యరేఖ, పుట్టపర్తి హౌసింగ్‌ అధికారి శేషగిరి, తహసీల్దార్‌ భాస్కరనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:47:29+05:30 IST