ఎంపీపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-28T04:53:01+05:30 IST

అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానిక మసీద్‌ కమిటీ సభ్యులు ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు ఫిర్యాదు చేశారు.

ఎంపీపై చర్యలు తీసుకోవాలి
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న మసీదు కమిటీ సభ్యులు

సిరిసిల్ల టౌన్‌, మే 27 :   అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానిక మసీద్‌ కమిటీ సభ్యులు ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు ఫిర్యాదు చేశారు.   ఈ సందర్భంగా మసీద్‌ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 25న కరీంనగర్‌లో  హిందూ ఏక్తా యాత్రంలో కరీంనగర్‌ ఎంపీ బండి  సంజయ్‌ ముస్లింల మనోభావాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారన్నారు.  కార్యక్రమంలో సిరిసిల్ల మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్‌ యూసుఫ్‌, సభ్యులు ఉన్నారు.

 

Updated Date - 2022-05-28T04:53:01+05:30 IST