ఎంపీపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-05-28T04:53:01+05:30 IST
అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానిక మసీద్ కమిటీ సభ్యులు ఎస్పీ రాహుల్ హెగ్డేకు ఫిర్యాదు చేశారు.
సిరిసిల్ల టౌన్, మే 27 : అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానిక మసీద్ కమిటీ సభ్యులు ఎస్పీ రాహుల్ హెగ్డేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 25న కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముస్లింల మనోభావాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ యూసుఫ్, సభ్యులు ఉన్నారు.