‘కర్ణాటక మద్యం అమ్మితే చర్యలు’

ABN , First Publish Date - 2021-05-17T05:18:16+05:30 IST

మండలంలో కర్ణాటక మద్యం అమ్మితే చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

‘కర్ణాటక మద్యం అమ్మితే చర్యలు’

గోనెగండ్ల, మే 16: మండలంలో కర్ణాటక మద్యం అమ్మితే చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని చాలా గ్రామాల్లో  అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఈ మేరకు సమాచారం అందుకొని ఇప్పటికే చాల మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-17T05:18:16+05:30 IST