‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి సాధించాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-05-17T05:20:20+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ సూచించారు.

‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి సాధించాలి : ఎమ్మెల్యే
కోహెడలో దళితబంధు కింద వాహనాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌

కోహెడ, మే 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ సూచించారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో దళితబంధు కింద ఏర్పాటుచేసిన కోటి 60 లక్షల విలువైన వాహనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండలంలోని ఆరెపల్లి, కాచాపూర్‌, తంగళ్లపల్లి గ్రామాలకు చెందిన 16 మంది షెడ్యూల్‌ కులాల లబ్ధిదారులకు మూడు ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 3 ఆటో ట్రాలీ, 8 ట్రాక్టర్లు, రోటా వేటర్లు, ట్రాలీలతో పాటు టెంట్‌హౌస్‌, సెంట్రింగ్‌ యూనిట్‌, రాతి, వెండి, స్టీల్‌ దుకాణాల కోసం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కీర్తి, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:20:20+05:30 IST