చీటింగ్ కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-04-21T05:43:38+05:30 IST
చీటింగ్ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తాలూకా ఎస్ఐ దిలీప్కుమార్ చెప్పారు.
మదనపల్లె క్రైం, ఏప్రిల్ 20: చీటింగ్ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తాలూకా ఎస్ఐ దిలీప్కుమార్ చెప్పారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ మొలకలదిన్నెకు చెందిన ఇడగొట్టి శ్రీరాములు గతేడాది తనకు చెందిన 18 కుంటల భూమిని మదనపల్లెకు చెందిన తనూజ్, ఇతరులకు రూ.28 లక్షలకు విక్రయించి రిజిస్ర్టేషన్ చేయించాడు. అయితే అదే 18 కుంటలనూ 2010లో పుంగనూరువాసులకు విక్రయించాడు. ఈనేపథ్యంలో తనూజ్, ఆయన తండ్రి శ్రీనివాసులు తాము కొనుగోలు చేసిన భూమిలోకి వెళ్లగా, పుంగనూరు వాసులు అడ్డుపడ్డారు. దీంతో శ్రీరాములు మోసం బయటపడింది. అమ్మిన భూమిని చూపకపోగా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తనూజ్ ఇటీవల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శ్రీరాములుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న శ్రీరాములును మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్ఐ చెప్పారు.