వాహనదారుల అప్రమత్తతతో ప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2021-01-25T06:30:21+05:30 IST

వాహనదారుల అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి శ్రీనివాస్‌ అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని సోనాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

వాహనదారుల అప్రమత్తతతో ప్రమాదాల నివారణ

బోథ్‌రూరల్‌, జనవరి 24: వాహనదారుల అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి శ్రీనివాస్‌ అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని సోనాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ను ధరించి, ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు అధికారి శ్రీనివాస్‌, రవాణా శాఖ అధికారులు హరింద్రకుమార్‌, సంతోష్‌రెడ్డి, సీఐ ముదావత్‌నైలు, ఎస్సై రాజు, ఎంపీపీ తుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:30:21+05:30 IST