గుర్తుతెలియని వాహనం ఢీకొని కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-10-19T05:43:39+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని వలస కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జాతీయరహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని కార్మికుడి మృతి
ఘటనా స్థలంలో మృతి చెందిన కార్మికుడు సుధామామాజీ

యడ్లపాడు, అక్టోబరు 18: గుర్తుతెలియని వాహనం ఢీకొని వలస కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జాతీయరహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాషా్ట్రనికి చెందిన సుధామమాజీ (30) తిమ్మాపురం గ్రామ పరిధిలో గల తిరుమల ఆయిల్‌ మిల్లులో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో సుధామమాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.


Updated Date - 2021-10-19T05:43:39+05:30 IST