కుమార్తె సహా గర్భిణి మృతి

ABN , First Publish Date - 2022-08-13T06:08:49+05:30 IST

మండలంలోని గాంధీనగర్‌ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణితో పాటు 11 నెలల పాప మృతి చెందింది.

కుమార్తె సహా గర్భిణి మృతి
చిన్నారి వైష్ణవి మృతదేహం

వినుకొండ టౌన్‌, ఆగస్టు 12: మండలంలోని గాంధీనగర్‌ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణితో పాటు 11 నెలల పాప మృతి చెందింది. రేషన్‌ షాపు డీలర్‌గా పని చేసే పెదకంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై భార్య అనూష(28), కుమార్తె వైష్ణవితో వినుకొండ వస్తుండగా ఈ ప్రమా దం చోటుచేసుకుంది. మూడు నెలలు గర్భవతి అయిన భార్యను వైద్యపరీక్షల నిమిత్తం వినుకొండకు ద్విచక్ర వాహనంపై తీసుకువస్తున్నాడు. ఈ క్రమం లో అద్దంకి నుంచి వస్తున్న లారీ వీరి పక్కగా రావ డంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో కిందపడిన అనూషపై లారీ ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కోటేశ్వరరావు, 11న నెలల చిన్నారి వైష్ణవి గాయపడటంతో స్థానికులు వినుకొం డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం...

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతిచెందారన్న సమాచారం మేరకు శావల్యాపురం మండలం కొత్తలూరుకి చెందిన అనూష తరపు బంధువులు వైద్యశాలకు చేరుకున్నారు. పెళ్లికి ఇచ్చిన కట్నకానుకలతో పాటు తమ కుమార్తెకు వచ్చే లావాదేవీలన్నీ తమకే చెందాలని వైద్యశాల వద్ద కోటేశ్వరరావు తండ్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇద్దరు చనిపోతే దాని గురించి పట్టించుకోకుండా నగదు విషయంలో గొడవకు దిగడాన్ని చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-13T06:08:49+05:30 IST