ఆటోనగర్‌ సిగ్నల్‌ వద్ద తప్పిన ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-07T06:54:17+05:30 IST

ఆటోనగర్‌ ఐలా సిగ్నల్‌ పాయింట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది

ఆటోనగర్‌ సిగ్నల్‌ వద్ద తప్పిన ఘోర ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బస్సును ఢీకొన్న లారీ

నాలుగు బస్సులు పాక్షికంగా ధ్వంసం

ఇద్దరికి స్వల్ప గాయాలు

ఆటోనగర్‌, మార్చి 6: ఆటోనగర్‌ ఐలా సిగ్నల్‌ పాయింట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. గంగవరం పోర్టు నుంచి బొగ్గు లోడుతో బీహెచ్‌పీవీ వైపు వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో  సిగ్నల్‌ వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ముందునున్న పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు ఆర్టీసీ బస్సులతోపాటు తిరుపతి నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేటు బస్సు పాక్షికంగా ఽధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికుడుతోపాటు ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 



Updated Date - 2021-03-07T06:54:17+05:30 IST