రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2021-04-16T05:13:12+05:30 IST
మండల కేంద్రంలోని బుగ్గవాగు సమీపంలో గురువారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి.
కారేపల్లి ఏప్రిల్ 15: మండల కేంద్రంలోని బుగ్గవాగు సమీపంలో గురువారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి. చీమలవారిగూడేనికి చెందిన గడ్డం రామకృష్ణ ఇంటినుంచి కారేపల్లికి వస్తుండగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పోచారానికి చెందిన రోతు శివ కారేపల్లి వైపు వస్తు బుగ్గవాగు సమీపంలో ఢీ కొన్నారు. క్షతగ్రాతులను కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. అక్కడ ప్రఽథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.