ఆవుపై కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం
ABN , First Publish Date - 2020-10-28T10:13:23+05:30 IST
దామగుండం అడవుల్లో ఆవుపై జరిపిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల దామగుండం అడవిలో ఆవుపై వేటగాళ్లు కాల్పుల జరిపిన సంగతి విదితమే
పరిగి: దామగుండం అడవుల్లో ఆవుపై జరిపిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల దామగుండం అడవిలో ఆవుపై వేటగాళ్లు కాల్పుల జరిపిన సంగతి విదితమే. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. ఆవు దేహనికి నిర్వహించిన పోస్టుమార్టంలో కొన్ని పార్టులను ఫోరెన్సిక్కు కూడా పంపించారు. నివేదిక వచ్చాక దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. పూడూరు మండలంలో ఓ అంతర్జాతీయ క్రీడాకారిణి బంఽధువులకు చెందిన ఫామ్హౌజ్ ఉంది. ఇక్కడికి నగరం నుంచి కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు వస్తుంటారని, ఆ వ్యక్తులే ఆవుపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో స్థానికులు కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసులకు లభిస్తున్న సమాచారం మేరకు విభిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.