అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు.
నాయుడుపేట, అక్టోబరు 19 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమ వారం ఆర్డీవో సరోజినితో కలసి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూములు గుర్తించి ఆ భూముల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు నిర్మించాలని కోరారు.
దొరవారిసత్రం: పూలతోటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోని శిథిల భవనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. తహసీల్ధారు పద్మావతి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైసీపీ రాష్ట్ర రైతు కార్యదర్శి కళత్తూరు రామమోహన్రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.