భవన నిర్మాణ పనులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-05-22T05:47:20+05:30 IST
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.
కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు, మే 21: గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. శనివారం నిర్మాణాల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇంకా ప్రారంభించని నిర్మాణాలను వచ్చే నెల 6వ తేదిలోపు పనులను ప్రారంభించాలన్నారు. జిల్లాలో ఇంకా 151 భవన నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉందన్నారు. పెండింగ్ బిల్లులుంటే నివేదికలు పంపిస్తే.. ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు. సాంకేతిక సమస్యలుంటే ప్రభుత్వ అనుమతి తీసుకుని బిల్లులను అప్లోడ్ చేయాలన్నారు.ఈ సమీక్షాసమావేశంలో ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డితో పాటు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.