పల్లీ గ్రేవీ కర్రీ
ABN , First Publish Date - 2016-12-03T20:05:19+05:30 IST
కావలసిన పదార్థాలు: పల్లీలు- ఒక కప్పు, పచ్చికొబ్బరి- పావుకప్పు, ఎండుమిర్చి- 2, తరిగిన టమోట, ఉల్లిపాయ- ఒక్కోటి చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- 10,
పల్లీలను అరగంట ముందు నానబెట్టి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీడిపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, టమోటా ముక్కలు వేసి వేగించాలి. వాటికి సోంపు పొడి, కారం, గరం మసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకులతో పోపు పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, మసాలా ముద్ద, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.