గద్వాల అధ్యాపకుడికి అబ్దుల్‌కలాం అవార్డు

ABN , First Publish Date - 2021-07-26T03:58:48+05:30 IST

గద్వాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న వెంకట కృష్ణమాచార్యులుకు అరుదైన గౌరవం లభించింది.

గద్వాల అధ్యాపకుడికి అబ్దుల్‌కలాం అవార్డు
హైదరాబాదులో సన్మానం పొందుతున్న వెంకట కృష్ణమాచార్యులు

గద్వాల అర్బన్‌, జూలై25: గద్వాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న వెంకట కృష్ణమాచార్యులుకు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాదుకు చెందిన పుడమి సాహితీ వేదిక సంస్థ వెంకట కృష్ణమాచార్యులును 2021 సంవత్సరానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏ.బీ.కే. అబ్దుల్‌ కలాం పేరున ఇచ్చే జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం హైదరా బాదులోని త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి సీ. ప్రార్థసారథి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఏనుగు నరసింహా రెడ్డి, మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌, పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ చిలు ముల బాలిరెడ్డి ఆధ్వర్యంలో అవార్డును అందజేసి సన్మానించారు. 


Updated Date - 2021-07-26T03:58:48+05:30 IST