ఆధార్‌ కేంద్రాల తనిఖీ

ABN , First Publish Date - 2022-06-30T03:12:44+05:30 IST

మండలంలోని మనుబోలు, మడమనూరు, బద్దెవోలులోని ఆధార్‌ కేంద్రాలను బుధవారం ఎంపీడీవో వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు

ఆధార్‌ కేంద్రాల తనిఖీ
బద్దెవోలు సచివాలయంలో తనిఖీ చేస్తున్న ఎంపీడీవో,అధికారులు

మనుబోలు, జూన్‌ 29: మండలంలోని మనుబోలు, మడమనూరు, బద్దెవోలులోని ఆధార్‌ కేంద్రాలను బుధవారం ఎంపీడీవో వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఆధార్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు, బయోమెట్రిక్‌ సమస్యలు, అప్‌డేషన్‌ వంటి వాటికోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేసింది.  దీంతో పలుగ్రామాల నుంచి ఆధార్‌ సమస్యలున్న వారంతా సచివాలయాలకు చేరుకున్నారు. దీంతో మూడు సచివాయాలు కిక్కిరిశాయి. 150మంది  నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆధార్‌ సమస్యలు పరిష్కరించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి రమణయ్య, కార్యదర్శులు  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T03:12:44+05:30 IST