చెక్‌డ్యాంలో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-11-28T05:25:29+05:30 IST

మండల పరిధిలోని ముక్తాపురం గ్రామ శివారులోని బొ ల్లోనిగుట్ట వద్దగల చెక్‌డ్యాంలో ఓ యువకుడు ప్రమాదవ శాత్తు జారిపడి మృతి చెందినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

చెక్‌డ్యాంలో పడి యువకుడి మృతి

ముదిగుబ్బ, నవంబరు 27: మండల పరిధిలోని ముక్తాపురం గ్రామ శివారులోని బొ ల్లోనిగుట్ట వద్దగల చెక్‌డ్యాంలో ఓ యువకుడు ప్రమాదవ శాత్తు జారిపడి మృతి చెందినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.మండలంలోని జొన్నలకొత్తపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర(25) మతిస్థిమి తం లేక శుక్రవారం ఇంటినుండి బయటకు వెళ్లాడు. ఈ నేపధ్యంలో ముక్తాపురం గ్రామ శి వారులోని బొల్లోనిగుట్ట వద్దగల చెక్‌డ్యాం వ ద్దకు వెళ్లాడు. అక్కడ తిరుగుతుండగా ప్రమాద వశాత్తుకాలు జారీ డ్యాంలోకి పడి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని  పరిశీలించారు. అనంతరం కేసునమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-11-28T05:25:29+05:30 IST