MA పూర్తి చేసిన 27ఏళ్ల యువతి.. గదిలో ఒంటరిగా ఉంటూ సంచలన నిర్ణయం..

ABN , First Publish Date - 2022-02-12T02:01:00+05:30 IST

ఆ యువతికి 27ఏళ్లు. ఎంఏ వరకూ చదవింది. ఎప్పుడూ గదిలో ఒంటరిగా గడిపే ఆమె.. శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను ఉద్దేశించి కొన్ని వాక్యాలు రాసి దారుణానికి పాల్పడింది. ప్రస్తుతం

MA పూర్తి చేసిన 27ఏళ్ల యువతి.. గదిలో ఒంటరిగా ఉంటూ సంచలన నిర్ణయం..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి 27ఏళ్లు. ఎంఏ వరకూ చదవింది. ఎప్పుడూ గదిలో ఒంటరిగా గడిపే ఆమె.. శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను ఉద్దేశించి కొన్ని వాక్యాలు రాసి దారుణానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా  చర్చనీయాంశం అయింది. 


హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన 27ఏళ్ల యువతి ఎంఏ వరకూ చదవింది. తల్లిదండ్రులతో కలిసి నహర్ కాలనీలో ఉంటున్న ఆమె.. శుక్రవారం రోజు దారుణానికి పాల్పడింది. తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన తల్లిదండ్రులను ఉద్దేశించి గదిలోని గోడపై కొన్ని వాక్యాలు రాసింది. ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి. జీవితంలో నేను ఏదీ సాధించలేకపోయాను. అందుకే చనిపోతున్నాను. మళ్లీ నేను మన ఇంట్లోనే జన్మిస్తా. మీరు ఏడవకండి. ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి’ అని గోడపై రాసింది. ఈ నేపథ్యంలో  అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగత జీవిగా ఉండటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.


కాగా.. యువతి ఆత్మహత్య చేసుకుందనే సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2022-02-12T02:01:00+05:30 IST