ప్రేమగా మారిన స్నేహం.. 3ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన యువకుడు.. పోలీసులు చెప్పినా వెనక్కి తగ్గని యువతి!

ABN , First Publish Date - 2022-04-16T14:52:19+05:30 IST

కాలేజీ రోజుల్లో ఒకరికొరకు పరిచయమయ్యారు. ఆ పరిచయం తొలుత స్నేహంగా.. తర్వాత ప్రేమగా మారింది. దీంతో మూడేళ్లపాటు ఆ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే సడన్‌గా ఆ యువకుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఆ మాటలు విని యువతికి మైండ్ బ్లాం

ప్రేమగా మారిన స్నేహం.. 3ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన యువకుడు.. పోలీసులు చెప్పినా వెనక్కి తగ్గని యువతి!

ఇంటర్నెట్ డెస్క్: కాలేజీ రోజుల్లో ఒకరికొరకు పరిచయమయ్యారు. ఆ పరిచయం తొలుత స్నేహంగా.. తర్వాత ప్రేమగా మారింది. దీంతో మూడేళ్లపాటు ఆ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే సడన్‌గా ఆ యువకుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఆ మాటలు విని యువతికి మైండ్ బ్లాంక్ అయింది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా పోలీసులు రంగంలోకి దిగినా ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాకు చెందిన యువతికి కాలేజీ రోజుల్లో రంజిత్ షా(23) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇలా మూడేళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆ యువతికి రంజిత్ షాకిచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. రంజిత్ నోటి నుంచి ఆ మాటలు విని యువతి కంగుతింది. పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పెళ్లికి రంజిత్‌ను ఒప్పించారు. ఆ తర్వాత రంజిత్ మళ్లీ మాట మార్చాడు. 



ఈ క్రమంలో రంజిత్ ఇంటి ముందు ఆ యువతి ధర్నాకు దిగింది. తల్లిదండ్రులతో కలిసి రంజిత్ ఇంటి ముందు కూర్చుంది. పెళ్లి కోసం డిమాండ్ చేస్తోంది. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. యువతికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు చేస్తే రంజిత్‌పై చర్యలు తీసుకుంటామని.. ధర్నాను విరమించుకోవాలని సూచించారు. అయితే ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక వేళ రంజిత్ తనను పెళ్లి చేసుకోకుంటే.. అతడి ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్య  చేసుకుంటానని హెచ్చిరిస్తోంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 




Updated Date - 2022-04-16T14:52:19+05:30 IST