కరోనా నుంచి సీఎం కేసీఆర్ కోలుకోవాలి
ABN , First Publish Date - 2021-04-21T07:08:58+05:30 IST
కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ నేలపట్ల రమేష్ కాంక్షించారు.
-ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నల్లగొండ కల్చరల్/ నల్లగొండ క్రైం/ నార్కట్పల్లి, ఏప్రిల్ 20 : కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ నేలపట్ల రమేష్ కాంక్షించారు. మంగళవారం పట్టణంలోని తులసీనగర్ శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయంలో అర్చక స్వాముల మంత్రోచ్ఛరణ మధ్య స్వామికి కేసీఆర్ గోత్రనామాల పేరున విశేషంగా పూజలు చేయించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ రుద్ర వెంకటేశం, చంద్రశేఖర్, కమిటీ సభ్యులు గందం రూపేందర్ గుప్తా, కూరెళ్ల రమణాచారి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్, టీఆర్ఎ్సవీతో పాటు వివిధ సంఘాల నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ అదేవిధంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినోత్సవం సందర్భంగా మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి పాల్గొన్నారు.