రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-07-04T04:51:43+05:30 IST

రామిరెడ్డికుంట సమీపంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో రాగి పోల మ్మ(50) అక్కడికక్కడే మృతిచెందిం ది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పోలమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

పోరుమామిళ్ల,  జూలై 3: రామిరెడ్డికుంట సమీపంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో రాగి పోల మ్మ(50) అక్కడికక్కడే మృతిచెందిం ది. భర్త నారాయణకు గాయాలయ్యా యి. నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలం రంగనాయుడుపేట వాసు లు నారాయణ, రాగిపోలమ్మ రామేశ్వరంలోని ఎస్టీ కాలనీలో ఉన్న బంధువు ల దగ్గరికి వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. రామిరెడ్డి కుంట సమీపంలో ఆ వాహనాన్ని లారీ ఢీకొనడంతో పోలమ్మ మృతిచెందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ హరిప్రసాద్‌ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ  జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-04T04:51:43+05:30 IST