Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో..
ABN , First Publish Date - 2022-08-09T21:24:27+05:30 IST
త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే తొందరలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వాహనాలను వేగంగా నడుపుతూ తాము ప్రమాదానికి గురవడమే కాకుండా..
త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే తొందరలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వాహనాలను వేగంగా నడుపుతూ తాము ప్రమాదానికి గురవడమే కాకుండా.. పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెడుతుంటారు. ఇంకొందరైతే కదులుతున్న వాహనాలను ఎక్కే క్రమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకు కలిసి కదులుతున్న రైలును (moving train) ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయలో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ (woman constable) గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది..
పశ్చిమ బెంగాల్లోని (West Bengal) బంకురా రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు తన కొడుకుతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చింది. అయితే వారు వెళ్లాల్సిన రైలు అప్పటికే కదిలేందుకు సిద్ధంగా ఉంది. ఎలాగైనా వెళ్లాలనే ఉద్దేశంతో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో రైలు వేగం మరింత పెరిగింది. అయినా బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వారిని గమనించి.. పరుగెత్తుకుంటూ వెళ్తుంది. బోగీని పట్టున్న తల్లీకొడుకు అదుపుతప్పి.. ప్లాట్ఫామ్పై పడిపోతారు. మహిళా కానిస్టేబుల్.. వారిని పట్టుకుని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పుతుంది. మొత్తానికి తల్లీకొడుకు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళా కానిస్టేబుల్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.