పెబ్బేరులో గో సేవ సభ్యులకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-08-06T05:57:29+05:30 IST

అఖిల భారత గోసేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి తిరు మల వరకు మహా పాదయాత్ర చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి శుక్రవారం పెబ్బేరుకు చేరుకు న్నారు.

పెబ్బేరులో గో సేవ సభ్యులకు ఘన స్వాగతం
పెబ్బేరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న గో సేవ సభ్యులు

పెబ్బేరు, ఆగస్టు 5: అఖిల భారత గోసేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి తిరు మల వరకు మహా పాదయాత్ర చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి శుక్రవారం పెబ్బేరుకు చేరుకు న్నారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ కార్యాలయం నుంచి సాయిబాబా, అయ్యప్పస్వామి దేవాల యం వరకు ర్యాలీగా భక్తులు తరలివచ్చారు. పాదయాత్ర చేస్తున్న గురుస్వాములకు, మహిళ లకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుభాష్‌ చౌరస్తాలో గోమాత గురించి గోసేవా ఫౌండేషన్‌ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడారు. గోవులను ఇంటి వద్ద పెంచుకుంటే మన ఆరోగ్యంతో పాటు, పిల్లల ఆరోగ్యం బాగుంటుందని, గోవులు అంతరించకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు ఈ ఉద్యమం ఆగదని, ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. కార్య క్రమంలో గో ఫౌండేషన్‌ సభ్యులు, పెబ్బేరు పుర ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T05:57:29+05:30 IST