దారికి తాత్కాలిక పరిష్కారం
ABN , First Publish Date - 2022-07-05T06:37:33+05:30 IST
బొడ్డువానిపాలెంలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి ఇంటి దారికి సంబంధించి పరిష్కారం లభిం చింది.
మేదరమెట్ల, జూలై 4: బొడ్డువానిపాలెంలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి ఇంటి దారికి సంబంధించి పరిష్కారం లభిం చింది. డివిజనల్ స్థాయి అధికారులు అందరూ స్థల యజ మాని వెంకటేశ్వర్లుతో మాట్లాడి తాత్కాలికంగా దారి ఇచ్చేలా ఒప్పించారు. సోమవారం చీరాల ఆర్డీవో సరోజినిదేవి, డీఎస్పీ శ్రీకాంత్, ఇన్చార్జ్ డీపీవో వి శ్వప్రసాద్లు మూడు గంటలకు పైగా స్థల యజయాని వెంకటేశ్వర్లుతో చర్చలు జరిపి సుధారాణి రాకపోకలకు ఆరు అడుగులు దారిని తాత్కాలికంగా ఇచ్చేందుకు ఒప్పించారు. భవిషత్లో కోర్టు నిర్ణయించిన విధంగా వెళ్లవచ్చు అని అధికారులు వారికి తెలిపారు. ఈ ఒప్పందానికి సుధారాణి కూడా అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు సమక్షంలో అ క్కడ ఉన్న గోడను కొంత మేర తొలగించారు. గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశనీయం అయిన వివాదానికి అధికారులు ముగింపు పలికారు. కొరశపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మేదరమెట్ల ఎస్ఐ శివకుమార్, ఎంపీడీవో సురేష్బాబు, ఈవోఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు హజరయ్యారు.