శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-10-18T06:07:24+05:30 IST

శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి కార్యక్రమం ఆదివారం గాజువాకలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల జంక్షన్‌ వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిఽఽథిగా విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళి
శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఇతర ప్రతినిధులు

గాజువాక, అక్టోబరు 17: శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి కార్యక్రమం ఆదివారం గాజువాకలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల జంక్షన్‌ వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిఽఽథిగా విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా అయితే సుఖసంతోషాలతో ఉన్నారో మల్లి అదే రామరాజ్య పరిపాలన అందించిన ఘనత శ్రీకృష్ణదేవరాయులదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కరణంరెడ్డి నరసింగరావు, జెర్రిపోతుల ముత్యాలు, రాజాన రామారావు, గంధం శ్రీనివాసరావు, సురేశ్‌, నాగేశ్వరరావు, మనోజ్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T06:07:24+05:30 IST