కువైట్‌లో గుండ్లచెరువు వాసి మృతి

ABN , First Publish Date - 2022-10-07T05:25:53+05:30 IST

బతుకుదెరువు కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తన కుటుం బం కోసం... కానరాని దేశానికి వెళ్లి కాయకష్టం చేసుకుంటూ జీవిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మరణించాడు.

కువైట్‌లో గుండ్లచెరువు వాసి మృతి
సుధాకర్‌రెడ్డి మృతదేహం

గాలివీడు, అక్టోబరు 6: బతుకుదెరువు కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తన కుటుం బం కోసం... కానరాని దేశానికి వెళ్లి కాయకష్టం చేసుకుంటూ జీవిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మరణించాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఇక మాకు దిక్కెవరంటూ పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు  మిన్నంటాయి. ఈ విషాదకర ఘటన మండలంలోని గుండ్లచెరువు పంచాయతీ బండివాండ్లపల్లెలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యు ల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...  బండివాండ్లపల్లెకు చెందిన బండి సుధాకర్‌రెడ్డి (44) తన భార్య సుజాతతో కలసి బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం కువైట్‌కు వెళ్లారు. భార్యభర్తలిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ పని చేసుకుంటూ ఉండేవారు. సుధాకర్‌రెడ్డి ఒక సేటు దగ్గర పనిచేస్తున్న సమయంలో సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే అక్కడి వారు వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుని భార్యకు ఫోన్‌ ద్వారా సేటు తెలియజేశాడు. ఆమె వెంటనే వైద్యశాలకు వెళ్లి భర్త మృతదేహాన్ని చూసి విలపించింది. అక్కడే ఉన్న కొంత మంది బంధువుల సాయంతో మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా మృతునికి ఒక కుమా ర్తె, ఒక కుమారుడు ఉన్నారు. సుధాకర్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. 

 

Updated Date - 2022-10-07T05:25:53+05:30 IST