కొవిడ్ నిబంధనలతోనే ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2022-01-22T05:11:30+05:30 IST
విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఈ నెల 24, 25, 27వ తేదీల్లో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కచ్చితంగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సంస్థ అధికారులకు సూచించారు.
ఈపీడీసీఎల్ అధికారులకు జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదేశం
విశాఖపట్నం, జనవరి 21: విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఈ నెల 24, 25, 27వ తేదీల్లో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కచ్చితంగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సంస్థ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ఏర్పాట్ల వివరాలను సీఎండీ సంతోషరావును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్చువల్ విధానంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా, ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వినియోగదారులు ‘హెచ్టిటిపి//డబ్ల్యుడబ్య్లుడబ్ల్యు.ఈల్ఐవిఇటిఈల్ఇసిఎఎస్టి.కామ్/ఎపిఇఆర్సిపబ్లిక్హియరింగ్’ వెబ్ లింక్ ద్వారా వీక్షించొచ్చని ఈపీడీసీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.