karnataka పరిశీలకుడిగా కేంద్ర మంత్రి dharmendra pradhan
ABN , First Publish Date - 2021-07-26T21:58:34+05:30 IST
కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కర్నాటక పరిశీలకునిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. ముఖ్యమంత్రి
బెంగళూరు : కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కర్నాటక పరిశీలకునిగా బీజేపీ అధిష్ఠానం నియమించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో తదుపరి సీఎం ఎవరన్న దానిపై కసరత్తు చేసే బాధ్యతను ధర్మేంద్ర ప్రధాన్పై మోపింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈయనకు సహకరిస్తారు. మరోవైపు అతి త్వరలోనే ధర్మేంద్ర ప్రధాన్ బెంగళూరుకు వెళ్తున్నారు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? తీసుకోరా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం మాత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మాత్రమే తీసుకుంటుందని కర్నాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ స్పష్టం చేశారు.