చేపల చెర్వులో మేత చల్లుతూ..

ABN , First Publish Date - 2022-05-15T07:00:25+05:30 IST

చేపల చెరువులో మేత చల్లుతుండగా పడవ బోల్తాపడి ఒక యువకుడు దుర్మరణం పాలైన ఘటన పెదగొన్నూరులో జరిగింది.

చేపల చెర్వులో మేత చల్లుతూ..
రామ్మోహనరావు (ఫైల్‌)

ముదినేపల్లి, మే 14 : చేపల చెరువులో మేత చల్లుతుండగా పడవ బోల్తాపడి ఒక యువకుడు దుర్మరణం పాలైన ఘటన పెదగొన్నూరులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల రామ్మోహనరావు (30) అనే యువకుడు తన చేపల చెరువులో శుక్రవారం సాయంత్రం మేత చల్లుతుండగా నరం వైరు తెగిపోవడంతో పడవ బోల్తా పడింది. దీంతో రామ్మోహనరావు నీటిలో పడిపోగా, తల ఇసుకలో కూరుకుపోయింది. అయితే కుమారుడు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో రామ్మోహనరావు తల్లి వెదుకుతుండగా చెరువులో నరం వైరు తెగి ఉండటాన్ని గమనించిన పలువురు నీటిలో వెదకగా రామ్మోహ నరావు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో పెదగొన్నూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. నాలుగేళ్ల క్రితం ఇదే చెరువు వద్ద విద్యుదా ఘాతంతో రామ్మోహన్‌రావు తండ్రి రామారావు మృతి చెందాడు.  

Updated Date - 2022-05-15T07:00:25+05:30 IST