రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-08-16T06:36:50+05:30 IST
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆంజనేయులు(40) అనే వ్యక్తి మృతి చెందాడు.
భార్య, కుమారుడికి గాయాలు
మోటారుసైకిల్ను కారు ఢీకొనడంతో ప్రమాదం
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళుతుండగా ఘటన
మంత్రాలయం, ఆగస్టు 15: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆంజనేయులు(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తెలంగాణలోని గద్వాల జిల్లా గుట్టు మండలం సాగదోణి గ్రామానికి చెందిన ఆంజనేయులు భార్య సరోజ, కుమారుడితో మోటారుసైకిల్పై బయల్దేరారు. ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకొని మంత్రాలయం వస్తుండగా చెట్నహాల్లి గ్రామపరిధిలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర హైదరాబాద్కు చెందిన కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆంజనేయులుకు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరోజకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు యువరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎస్ఐ మేణుగోపాల్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.