కొబ్బరి చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-12-04T06:44:33+05:30 IST
పలివెల శివారు శేరెపాలేనికి చెందిన పిల్లా సర్వేశ్వరరావు(48) గురువారం సాయంత్రం కొబ్బరికాయలు తీసేందుకు కొబ్బరిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తూ చెట్టుపైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు.
కొత్తపేట, డిసెంబరు 3: పలివెల శివారు శేరెపాలేనికి చెందిన పిల్లా సర్వేశ్వరరావు(48) గురువారం సాయంత్రం కొబ్బరికాయలు తీసేందుకు కొబ్బరిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తూ చెట్టుపైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అతడి కుమారుడు వెంకటతాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ జీవీ కృష్ణారావు తెలిపారు.