Killed for Chapati: చపాతీ ఇవ్వలేదని దారుణం.. నడిరోడ్డు మీద హత్య చేసిన వ్యక్తి!
ABN , First Publish Date - 2022-07-30T00:38:34+05:30 IST
సమాజంలో నేర సంస్కృతి విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాటలు, హత్యలు జరుగుతున్నాయి.
సమాజంలో నేర సంస్కృతి విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాటలు, హత్యలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తాజాగా ఓ దారుణం జరిగింది. చపాతీ ఇవ్వలేదనే (Killed for Chapati) కోపంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో మున్నా అనే 40 ఏళ్ల వ్యక్తి రిక్షా నడుపుతూ (rickshaw puller killed) జీవనం సాగిస్తున్నాడు. జులై 26 రాత్రి చపాతీలు కొనుక్కుని తన రిక్షాలో కూర్చొని తింటున్నాడు. మున్నాతో పాటు అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు.
ఇది కూడా చదవండి..
Viral News: వామ్మో.. కాటేసిన పామును హాస్పిటల్కు తీసుకెళ్లిన వ్యక్తి.. పరుగులు తీసిన జనం..!
ఆ సమయంలో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి అక్కడకు వెళ్లాడు. అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడు. బాగా ఆకలిగా ఉందని ఒక చపాతీ ఇవ్వాలని అడిగాడు. దాంతో మున్నా అతడికి చపాతీ ఇచ్చాడు. అది తినేసిన తర్వాత ఆ వ్యక్తి మరో చపాతీ అడిగాడు. మరో చపాతీ ఇవ్వడానికి మున్నా నిరాకరించాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చపాతి ఇవ్వలేదన్న కోపంతో మున్నాపై ఆ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
పక్కనే ఉన్న మున్నా మిత్రుడు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే మున్నా మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మున్నా స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా కరోల్ బాగ్ ప్రాంతంలో రోడ్డుపై ఉంటున్న అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. చివరకు నిందితుడిని పట్టుకున్నారు. క్షణికావేశంలో మున్నాను చంపినట్లు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి నేరం అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.