జ్వరాలపై ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2022-07-03T05:25:31+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లాలోని గ్రామాల్లో జ్వర పీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.జగన్నాథరావు తెలిపారు.

జ్వరాలపై ఇంటింటి సర్వే
సీసాడవలసలో గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

  డీఎంహెచ్‌వో జగన్నాథరావు

కొమరాడ, జూలై 2 : పార్వతీపురం మన్యం జిల్లాలోని గ్రామాల్లో జ్వర పీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.జగన్నాథరావు తెలిపారు. శనివారం కొమరాడ మండలంలోని చినఖేర్జిల, సీసాడవలస గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జ్వర పీడితుల పరిస్థితిపై సమీక్షించారు.  సిబ్బంది ఇంటింటికి వెళ్లి రోగుల పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు. వర్షాలు  కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.  గ్రామాల్లో అవసరమైన మేరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.   పారిశుధ్యం లోపించకుండా చూడాలన్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రతి 15 రోజులకొకసారి రక్షిత నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌  చేయించాలన్నారు. ప్రజలు వేడి నీటిని తాగడంతో పాటు దోమ తెరలను వినియోగించాలని, వేడి వేడి ఆహార పదార్థాలనే తినాలని సూచించారు. ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలు దోమ తెరలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని కోరారు.


Updated Date - 2022-07-03T05:25:31+05:30 IST