ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-04-19T04:21:16+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
బోడకొండలో కల్లాల్లోనే ధాన్యం బస్తాలు

మంచాల : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు పీఏసీఎస్‌ డైరెక్టర్‌ జెనిగె వెంకటే్‌షయాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన చెన్నారెడ్డిగూడ, బోడకొండ తదితర గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సాగుకు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయని, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ధాన్యం బస్తాలను వ్యవసాయ పొలాల్లోనే నిల్వ చేశారని అన్నారు. వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నందున ధాన్యం తడిసి రైతులు ప్రమాదముందన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-19T04:21:16+05:30 IST