యువత భవిష్యత్తును కాలరాసిన సర్కారు

ABN , First Publish Date - 2022-01-23T05:46:09+05:30 IST

ఏడేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును కాల రాసిందని జడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌, జాగో ఫోరమ్‌ ఫర్‌ ఆదిలాబాద్‌ పీపుల్స్‌ కన్వీనర్‌ సుహాసినిరెడ్డి ధ్వజమెత్తారు.

యువత భవిష్యత్తును కాలరాసిన సర్కారు


బేల, జనవరి22:
ఏడేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును కాల రాసిందని జడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌, జాగో ఫోరమ్‌ ఫర్‌ ఆదిలాబాద్‌ పీపుల్స్‌ కన్వీనర్‌ సుహాసినిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం బేల మండల కేంద్రంలో జాగోఫోరమ్‌ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. జిల్లా నుంచి ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌, గిరిజన విశ్వ విద్యాలయం, టెక్స్‌టైల్‌పార్కులను ఇతర జిల్లాకు తరలించారని తెలిపారు. వనరులు అన్ని ఉన్నా పాలకుల అసమర్థత కారణంగా యువత భవిష్యత్తు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్‌ కోసం మరో ఉద్యమం తప్పదన్నారు.దీని కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాన రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. మార్కెట్‌ కాలనీలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

Updated Date - 2022-01-23T05:46:09+05:30 IST