యాదవులకు చేయూతనివ్వని ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-08-19T04:45:59+05:30 IST
విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణాలో యాదవులకు ప్రభుత్వం చేయూత అంతంతమాత్రంగానే ఉందని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు.
- యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం
మందమర్రి టౌన్, ఆగస్టు 18 : విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణాలో యాదవులకు ప్రభుత్వం చేయూత అంతంతమాత్రంగానే ఉందని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు. మందమర్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచార జీవనం సాగించే యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం బాగున్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన గొర్రెలు ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. దళితుల అభివృద్ధికి దళిత బంధు ప్రవేశపెట్టిన విధంగా యాదవుల అభివృద్ధికి కూడా అలాంటి పథకం పెడితే బాగుంటుందని తెలి పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార ్యదర్శి గడ్డం సతీష్ యాదవ్, జిల్లా పట్టణ నాయకులు మల్లెత్తుల నరేష్, అల్లంల ప్రభాకర్, అల్లంల మొండి, మహేందర్, సందనవేణి సంజీవ్, అల్లంల ప్రవీణ్, యాదవులు పాల్గొన్నారు.