రైతాంగ సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-23T04:37:57+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగంపై మొసలికన్నీరు కార్చుతూ సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు.

రైతాంగ సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
రైతుబజారులోని కూరగాయల రైతులకు డిక్లరేషన్‌ కరపత్రాలను అందజేస్తున్న ప్రతాప్‌రెడ్డి

రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి

చేర్యాల, మే 22: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగంపై మొసలికన్నీరు కార్చుతూ సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని ముస్త్యాల, వీరన్నపేట గ్రామాల్లో ఆదివారం ఆయన రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబజారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతుల పాలిట ఆత్మబంధువు అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన సొంత జిల్లాలోని రైతులకైనా రుణమాఫీ అమలుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ధాన్యం పట్టకుండా, రైతాంగ ఇబ్బందులు పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రాల పర్యటన చేపట్టడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అన్నదాతలు ఆత్మస్థైర్యంతో జీవించారని, రానున్నరోజుల్లో మద్దతు ధర పొందాలన్నా, న్యాయం చేకూరాలన్నా కాంగ్రె్‌సతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ము నర్సింగరావు, భాస్కర్‌రెడ్డి, తోళ్ల రాజేశ్వరి, నల్లగోని బాలకిషన్‌, సిద్ధారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:37:57+05:30 IST