ముంబైలోని ఐసీయూలన్నీ ఫుల్.. కొవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో..

ABN , First Publish Date - 2020-05-29T22:14:30+05:30 IST

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో నగరంలోని...

ముంబైలోని ఐసీయూలన్నీ ఫుల్.. కొవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో..

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కొవిడ్-19 పేషెంట్లకు కేటాయించిన దాదాపు అన్ని ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. బృహన్ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 27 నాటికి 645 ఐసీయూ పడకల్లో 99 శాతం నిండిపోగా.. ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న 4292 బెడ్లలో 65 శాతం నిండిపోయాయి. మరోవైపు 373 వెంటలేటర్లలో ప్రస్తుతం 73 శాతం వినియోగంలో ఉన్నాయి. కాగా కొత్తగా ముంబైలో 1438 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 35,273కు చేరింది.

Updated Date - 2020-05-29T22:14:30+05:30 IST